ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా కిషోర్ కుమార్
ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా కిషోర్ కుమార్
K.RAVI
చౌటుప్పల్ మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా బొమ్మకంటి కిషోర్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొయ్యలగూడెంలో ఫోరం జిల్లా అధ్యక్షుడు సుర్కంటి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు.గౌరవ అధ్యక్షులుగా మీసాల నరసింహ, ఉపాధ్యక్షులు జెల్ల పవన్ కుమార్, బాతరాజు ధనుంజయ్, పల్చం జయమ్మ, ప్రధాన కార్యదర్శి బోయ సదానందం, కార్యదర్శి శ్యామల చిరంజీవి, కార్యనిర్వహణ అధ్యక్షులు కందగట్ల సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులు నిమ్మల సత్యనారాయణ, ముద్దం రమేష్ యాదవ్, కోశాధికారి వలందాసు మహేష్ గౌడ్, గౌరవ సలహాదారులు పిన్నింటి శ్రీనివాసరెడ్డి, ఉప్పునూతల నరసింహ, సుర్కంటి ప్రభాకర్ రెడ్డి, ఫకీరు శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు బోయిని లింగస్వామి యాదవ్, గడ్డం సత్తయ్య, పెరుమాండ్ల లింగస్వామి, బక్కనగారి శ్రవణ్ కుమార్, సామిడి శ్రీనివాస్ రెడ్డి, సుర్కంటి అనుపు రెడ్డి, డి. రాజులను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. మండలంలోని ఉపసర్పంచుల హక్కుల పరిరక్షణతో పాటు, గ్రామాల సమగ్ర అభివృద్ధికి అందరినీ సమన్వయం చేసుకుంటూ కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి