మాజీ సర్పంచ్ చెరుకు సోమయ్య మృతి బాధాకరం: నంద్యాల బిక్షం రెడ్డి.
మాజీ సర్పంచ్ చెరుకు సోమయ్య మృతి బాధాకరం: నంద్యాల బిక్షం రెడ్డి.
Editor Desk
రామన్నపేట మండలంలోని తుర్కపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చెరుకు సోమయ్య అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని రామన్నపేట సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి అన్నారు. శనివారం ఆయన తుర్కపల్లి గ్రామానికి వెళ్లి చెరుకు సోమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బిక్షం రెడ్డి మాట్లాడుతూ తుర్కపల్లి గ్రామ తొలి సర్పంచ్గా చెరుకు సోమయ్య గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు గుత్తా నర్సిరెడ్డి, గ్రామ సర్పంచ్ చల్ల వరలక్ష్మి పిచ్చిరెడ్డి, సూరారం గ్రామ సర్పంచ్ బమీడిక శీను, ఉపసర్పంచ్ కన్నెబోయిన మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు జాన్ రెడ్డి, వార్డు సభ్యులు చిట్టిమల్ల లక్ష్మమ్మ, చిట్టిమల్ల చంద్రకళ, దొడ్డి శంకరయ్య, నకిరేకంటి ప్రశాంత్, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ చిట్టిమల్ల అంజయ్య, నాయకులు పోతగాని రామరాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి