Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రొద్దంలో ఉషశ్రీపై మండల కూటమి నాయకుల ఫైర్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 13, 2026 06:58 PM

ఎమ్మెల్యే వీరేశం చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.

ఎమ్మెల్యే వీరేశం చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.

ఎమ్మెల్యే వీరేశం చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.
June 13, 2026 05:05 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం మండల కేంద్రంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యం, ప్రమాదాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గణనీయమైన ఊరట లభిస్తోందన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి కె.ఎం. జాన్, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్, నాయకులు జేల్లా వెంకటేష్, గొరిగే శేఖర్, వినాయతుల్లా బేగ్, మన్సూర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News