ఎమ్మెల్యే వీరేశం చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.
ఎమ్మెల్యే వీరేశం చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.
Editor Desk
రామన్నపేట: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం మండల కేంద్రంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యం, ప్రమాదాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గణనీయమైన ఊరట లభిస్తోందన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి కె.ఎం. జాన్, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్, నాయకులు జేల్లా వెంకటేష్, గొరిగే శేఖర్, వినాయతుల్లా బేగ్, మన్సూర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి