శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం వినాయక్ నగర్లో శనివారం తెల్లవారుజామున భారీ వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. అయితే ప్రమాదానికి 10 నిమిషాల ముందే కుటుంబ సభ్యులు వర్షానికి భయపడి ఇంటి నుంచి బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోగా, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు పరిస్థితిని పరిశీలించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి