ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నూతన అధ్యక్షులు
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నూతన అధ్యక్షులు
K.RAVI
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన బోయ దేవేందర్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చౌటుప్పల్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. చౌటుప్పల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన బోయ దేవేందర్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన కాసర్ల శ్రీనివాస్ రెడ్డిలు.. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ ఉబ్బు వెంకటయ్యతో కలిసి హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.తమకు అధ్యక్షులుగా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దేవేందర్, శ్రీనివాస్ రెడ్డిలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తామని పేర్కొన్నారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, పార్టీ బలోపేతానికి కంకణబద్ధులమై పనిచేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభినందిస్తూ, పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి