Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఫార్మ్‌హౌస్ పార్టీలో వివాదం: ప్రైవేట్ ఉద్యోగి అనుమానాస్పద మృతి "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 14, 2026 10:01 PM

చౌటుప్పల్‌లో ఘనంగా చేగువేరా జయంతి వేడుకలు

చౌటుప్పల్‌లో ఘనంగా చేగువేరా జయంతి వేడుకలు

చౌటుప్పల్‌లో ఘనంగా చేగువేరా జయంతి వేడుకలు
June 14, 2026 08:37 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రపంచ విప్లవయోధుడు ఎర్నెస్టో చేగువేరా జయంతి వేడుకలను చౌటుప్పల్ పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకుడు ఆముదాల పరమేశ్ ఆధ్వర్యంలో చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా "ప్రతి అడుగు స్వచ్ఛత వైపు.. నవ నిర్మాణమే జనసేన లక్ష్యం" అనే నినాదంతో పైలాన్ పార్క్, తంగేడు వనంలో ప్రజలకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. అలాగే యువతకు చేగువేరా జీవిత చరిత్ర పుస్తకాలను అందజేశారు.​ఈ సందర్భంగా పరమేశ్ మాట్లాడుతూ.. సరిహద్దులు లేని మానవత్వం కోసం పోరాడిన చేగువేరా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని జనసైనికులు ప్రజా సమస్యలపై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆముదాల పరమేశ్, బొల్లం మల్లేశ్, చిన్నం ప్రశాంత్, బద్రి రాజు, చిన్నం రాజీవ్, పెద్దగొని లింగస్వామి, సరికొండ సంజయ్, పాశం శ్రీనాథ్, శ్రీకాంత్, ముద్ధం రాజు, గణేష్, దొడ్డి వంశీ, బాలగోని శివ, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News