చౌటుప్పల్లో ఘనంగా చేగువేరా జయంతి వేడుకలు
చౌటుప్పల్లో ఘనంగా చేగువేరా జయంతి వేడుకలు
K.RAVI
ప్రపంచ విప్లవయోధుడు ఎర్నెస్టో చేగువేరా జయంతి వేడుకలను చౌటుప్పల్ పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకుడు ఆముదాల పరమేశ్ ఆధ్వర్యంలో చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా "ప్రతి అడుగు స్వచ్ఛత వైపు.. నవ నిర్మాణమే జనసేన లక్ష్యం" అనే నినాదంతో పైలాన్ పార్క్, తంగేడు వనంలో ప్రజలకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. అలాగే యువతకు చేగువేరా జీవిత చరిత్ర పుస్తకాలను అందజేశారు.ఈ సందర్భంగా పరమేశ్ మాట్లాడుతూ.. సరిహద్దులు లేని మానవత్వం కోసం పోరాడిన చేగువేరా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని జనసైనికులు ప్రజా సమస్యలపై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆముదాల పరమేశ్, బొల్లం మల్లేశ్, చిన్నం ప్రశాంత్, బద్రి రాజు, చిన్నం రాజీవ్, పెద్దగొని లింగస్వామి, సరికొండ సంజయ్, పాశం శ్రీనాథ్, శ్రీకాంత్, ముద్ధం రాజు, గణేష్, దొడ్డి వంశీ, బాలగోని శివ, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి