Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:55 PM

బోరంచ గ్రామంలో ఘనంగా ఐదవ వారపు హనుమాన్ చాలీసా కార్యక్రమం

బోరంచ గ్రామంలో ఘనంగా ఐదవ వారపు హనుమాన్ చాలీసా కార్యక్రమం

బోరంచ గ్రామంలో ఘనంగా ఐదవ వారపు హనుమాన్ చాలీసా కార్యక్రమం
13-06-2026 123 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ హనుమాన్ ఆలయంలో శనివారం విశ్వ హిందూ పరిషత్, బజరంగదళ్ ఆధ్వర్యంలో ఐదవ వారంగా నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. గ్రామ యువత, యువకులు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని సమిష్టిగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడంతో పాటు "జై శ్రీరామ్.. జై శ్రీరామ్" నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. ఈ సందర్భంగా గ్రామ శాంతి, ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేయగా, ఈ వారపు ప్రసాద దాతగా సేవలందించిన గ్రామానికి చెందిన గుడిమె హనుమంతును గ్రామ హిందూ సేవా సభ్యులు ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ధార్మిక చైతన్యం, ఐక్యత, సనాతన సంస్కృతి పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయని నిర్వాహకులు పేర్కొంటూ, భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

Sthanikam

బోరంచ గ్రామంలో ఘనంగా ఐదవ వారపు హనుమాన్ చాలీసా కార్యక్రమం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ హనుమాన్ ఆలయంలో శనివారం విశ్వ హిందూ పరిషత్, బజరంగదళ్ ఆధ్వర్యంలో ఐదవ వారంగా నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. గ్రామ యువత, యువకులు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని సమిష్టిగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడంతో పాటు "జై శ్రీరామ్.. జై శ్రీరామ్" నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. ఈ సందర్భంగా గ్రామ శాంతి, ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేయగా, ఈ వారపు ప్రసాద దాతగా సేవలందించిన గ్రామానికి చెందిన గుడిమె హనుమంతును గ్రామ హిందూ సేవా సభ్యులు ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ధార్మిక చైతన్యం, ఐక్యత, సనాతన సంస్కృతి పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయని నిర్వాహకులు పేర్కొంటూ, భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News