నీర్నేములలో గంగుల అమరేందర్ రెడ్డికి సిపిఎం నేతల నివాళి.
నీర్నేములలో గంగుల అమరేందర్ రెడ్డికి సిపిఎం నేతల నివాళి.
Editor Desk
రామన్నపేట మండలం నీర్నేముల గ్రామానికి చెందిన గంగుల అమరేందర్ రెడ్డి అకాల మరణం చెందడంతో సిపిఎం గ్రామ శాఖ నాయకత్వం శనివారం వారి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించింది. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరేందర్ రెడ్డి మరణం గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కలిగి ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి నాగటి లక్ష్మణ్, పార్టీ సీనియర్ నాయకులు బండా జగన్మోహన్ రెడ్డి, వార్డు సభ్యులు బోయిని ఐలమ్మ, మల్లేశం, మాజీ వార్డు సభ్యులు నేమనంది లింగయ్య, నాగటి అంజయ్య, నాగటి మహేష్, నాయకులు నాగటి యాదయ్య, దాసరి నర్సింహ, బోయిని రామచంద్రం, పాల్వాయి చంద్రశేఖర్ రెడ్డి, ఆవుల సత్తయ్య, ఏభూషి రవి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి