విద్యను వ్యాపారంగా మార్చొద్దు. నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలను మూసివేయాలి: చినపాక రమేష్.
విద్యను వ్యాపారంగా మార్చొద్దు. నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలను మూసివేయాలి: చినపాక రమేష్.
Editor Desk
రామన్నపేట: మండలంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల చదువులను, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చాయని బీఆర్ఎస్వీ నకిరేకల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, నీర్నెముల 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్ ఆరోపించారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొన్ని పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ తరగతులను రేకుల షెడ్లలో నిర్వహించడం వల్ల చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హతలు లేని బోధనా సిబ్బందితో, అరకొర వసతులతో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
ఫీజుల కోసం తల్లిదండ్రులను వేధిస్తూ అధిక మొత్తాలు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థుల చేరికలను పెంచేందుకు అధికారులు కృషి చేసి ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని చినపాక రమేష్ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి