Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిట్టంపల్లి వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 17, 2026 03:03 PM

పాఠశాలల వద్ద కోతులు, కుక్కల బెడద లేకుండా చూడండి

పాఠశాలల వద్ద కోతులు, కుక్కల బెడద లేకుండా చూడండి

పాఠశాలల వద్ద కోతులు, కుక్కల బెడద లేకుండా చూడండి
June 16, 2026 07:29 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* అధికారులకు చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ ఆదేశం

* క్షేత్రస్థాయిలో మున్సిపల్ కమిషనర్ పర్యటన

చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని పాఠశాలల సమీపంలో కోతులు, వీధి కుక్కల బెడద లేకుండా తక్షణమే తగిన జాగ్రత్తలు, నివారణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల పరిసరాల్లో కోతుల సంచారం ఎక్కువగా ఉందన్న సమాచారంతో మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని స్వయంగా సమీక్షించారు.​ఇటీవలే నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై విద్యార్థులు పాఠశాలలకు వస్తున్న నేపథ్యంలో, వారి భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ స్పష్టం చేశారు. పాఠశాల ఆవరణలో కానీ, పరిసర ప్రాంతాలలో కానీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కోతులను, వీధి కుక్కలను నియంత్రించాలని అక్కడికక్కడే అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.​పాఠశాలల ప్రాంగణాల్లో విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదు.​మున్సిపల్ సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలి.​పాఠశాలల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ, పిచ్చిమొక్కలను త్వరితగతిన తొలగించాలి.​అధికారులు, సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని, విద్యార్థులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని కమిషనర్ వెంకటేశ్వర నాయక్ ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News