ఓటర్ల జాబితా సవరణలో బీఎల్ఏలే కీలక భూమిక – సంగారెడ్డిలో అవగాహన శిక్షణా శిబిరం
ఓటర్ల జాబితా సవరణలో బీఎల్ఏలే కీలక భూమిక – సంగారెడ్డిలో అవగాహన శిక్షణా శిబిరం
Krishna
సంగారెడ్డి పట్టణంలోని రెడ్లస్ హోటల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) అవగాహన మరియు శిక్షణా శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ శిక్షకులు రాజీవ్ మరియు శిక్షక బృందం బీఎల్ఏలకు ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, మరణించిన మరియు వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలపై సమగ్ర శిక్షణ అందించారు. నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసి యువతను ఓటర్లుగా నమోదు చేయడంతో పాటు జాబితాలోని లోపాలను సరిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపకల్పన ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉపసర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో బీఎల్ఏలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి