Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:49 AM

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
16-06-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని సంఘం మండల ప్రధాన కార్యదర్శి గామాసు జోగయ్య పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య భవనంలో మంగళవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం సంఘం అధ్యక్షుడు నాగులవంచ వెంకటరామయ్య అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా గామాసు జోగయ్య మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కూలి పనిపై ఆధారపడే కుటుంబాలు పౌష్టికాహారం అందక రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు అధికమై కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగాయని పేర్కొన్నారు. దీంతో ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని అన్నారు. వ్యవసాయ కూలీలు, పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం రాష్ట్ర మహాసభల ప్రచారంలో భాగంగా వెంకటాపురం గ్రామంలో తాళ్లూరు వెంకటనారాయణ సంఘం జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కుడెల్లి నాగేశ్వరరావు, షేక్ నాగుల్‌మీరా, పుటేటి వెంకటనారాయణరెడ్డి, మస్తాన్, భసవయ్య, నక్క పుల్లరావు, కోల రామకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి

Article Image

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని సంఘం మండల ప్రధాన కార్యదర్శి గామాసు జోగయ్య పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య భవనంలో మంగళవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం సంఘం అధ్యక్షుడు నాగులవంచ వెంకటరామయ్య అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా గామాసు జోగయ్య మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కూలి పనిపై ఆధారపడే కుటుంబాలు పౌష్టికాహారం అందక రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు అధికమై కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగాయని పేర్కొన్నారు. దీంతో ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని అన్నారు. వ్యవసాయ కూలీలు, పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం రాష్ట్ర మహాసభల ప్రచారంలో భాగంగా వెంకటాపురం గ్రామంలో తాళ్లూరు వెంకటనారాయణ సంఘం జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కుడెల్లి నాగేశ్వరరావు, షేక్ నాగుల్‌మీరా, పుటేటి వెంకటనారాయణరెడ్డి, మస్తాన్, భసవయ్య, నక్క పుల్లరావు, కోల రామకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News