దిల్ సుఖ్ నగర్ లో పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల ధర్నా
దిల్ సుఖ్ నగర్ లో పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల ధర్నా
Editor Desk
ఎల్బినగర్,
పోలీస్ నియామకాల్లో వయోపరిమితి పెంపుతో పాటు పెండింగ్ నోటిఫికేషన్లను విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల జేఏసీ ఆధ్వర్యంలో దిల్ సుఖ్ నగర్ లో మంగళవారం సాయంత్రం మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత, విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ19/20 పే స్కేల్ ఉద్యోగాలతో పాటు పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ పోస్టులకు 36 సంవత్సరాలు, ఎస్ఐ పోస్టులకు 38 సంవత్సరాల వయోపరిమితి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో తెలంగాణ పోలీస్ విద్యార్థుల జేఏసీ నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ర్యాలీ నిర్వహిస్తున్న నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి