Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:52 AM

భారీ వర్షాలపై అప్రమత్తం. వాటర్‌లాగింగ్ ప్రాంతాల పరిశీలన.. అధికారులకు డీసీపీ అనురాధ ఆదేశాలు

భారీ వర్షాలపై అప్రమత్తం. వాటర్‌లాగింగ్ ప్రాంతాల పరిశీలన.. అధికారులకు డీసీపీ అనురాధ ఆదేశాలు

భారీ వర్షాలపై అప్రమత్తం. వాటర్‌లాగింగ్ ప్రాంతాల పరిశీలన.. అధికారులకు డీసీపీ అనురాధ ఆదేశాలు
16-06-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్ : ర్రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎల్బీనగర్ డీసీపీ అనురాధ (ఐపీఎస్) అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డితో కలిసి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని వాటర్‌లాగింగ్ ప్రాంతాలను ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, నీటి నిల్వల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైన యంత్రాంగం, సిబ్బందిని అందుబాటులో ఉంచి అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వనస్థలిపురం ఎస్‌హెచ్‌వో రవిబాబు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌తో పాటు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

భారీ వర్షాలపై అప్రమత్తం. వాటర్‌లాగింగ్ ప్రాంతాల పరిశీలన.. అధికారులకు డీసీపీ అనురాధ ఆదేశాలు

Article Image

ఎల్బీనగర్ : ర్రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎల్బీనగర్ డీసీపీ అనురాధ (ఐపీఎస్) అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డితో కలిసి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని వాటర్‌లాగింగ్ ప్రాంతాలను ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, నీటి నిల్వల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైన యంత్రాంగం, సిబ్బందిని అందుబాటులో ఉంచి అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వనస్థలిపురం ఎస్‌హెచ్‌వో రవిబాబు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌తో పాటు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News