Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిట్టంపల్లి వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 17, 2026 03:02 PM

దేశం కోసం యువతరం కదలాలి. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం: సీపీఎం నేతల విమర్శలు

దేశం కోసం యువతరం కదలాలి. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం: సీపీఎం నేతల విమర్శలు

దేశం కోసం యువతరం కదలాలి. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం: సీపీఎం నేతల విమర్శలు
June 16, 2026 08:05 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్, దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, పెట్టుబడిదారుల ఆధిపత్యం నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి యువత ముందుకు రావాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. కొత్తపేటలోని బీజేఆర్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన యువ కమ్యూనిస్టుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

సమ్మేళనంలో సీపీఎం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టిందని ఆరోపించారు. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును హైదరాబాద్‌లోని ఓ రోడ్డుకు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు.

రాజ్యసభ సభ్యుడు రహీం మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగాయని, గ్రామీణ ప్రాంతాలకు ఊతమిచ్చే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు.

జాన్ వెస్లీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను సీపీఎం నిరంతరం ప్రశ్నిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

సమసమాజ స్థాపన కోసం యువత రాజకీయాల్లోకి రావాలని, సీపీఎం బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చంద్రమోహన్, తొట రమేశ్, పగడాల యాదయ్య, కట్ట శ్రీనివాస్, కీసరి నర్సిరెడ్డి తదితరులతో పాటు డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News