Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:49 AM

దేశం కోసం యువతరం కదలాలి. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం: సీపీఎం నేతల విమర్శలు

దేశం కోసం యువతరం కదలాలి. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం: సీపీఎం నేతల విమర్శలు

దేశం కోసం యువతరం కదలాలి. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం: సీపీఎం నేతల విమర్శలు
16-06-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్, దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, పెట్టుబడిదారుల ఆధిపత్యం నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి యువత ముందుకు రావాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. కొత్తపేటలోని బీజేఆర్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన యువ కమ్యూనిస్టుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

సమ్మేళనంలో సీపీఎం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టిందని ఆరోపించారు. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును హైదరాబాద్‌లోని ఓ రోడ్డుకు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు.

రాజ్యసభ సభ్యుడు రహీం మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగాయని, గ్రామీణ ప్రాంతాలకు ఊతమిచ్చే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు.

జాన్ వెస్లీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను సీపీఎం నిరంతరం ప్రశ్నిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

సమసమాజ స్థాపన కోసం యువత రాజకీయాల్లోకి రావాలని, సీపీఎం బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చంద్రమోహన్, తొట రమేశ్, పగడాల యాదయ్య, కట్ట శ్రీనివాస్, కీసరి నర్సిరెడ్డి తదితరులతో పాటు డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

దేశం కోసం యువతరం కదలాలి. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం: సీపీఎం నేతల విమర్శలు

Article Image

ఎల్బీనగర్, దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, పెట్టుబడిదారుల ఆధిపత్యం నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి యువత ముందుకు రావాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. కొత్తపేటలోని బీజేఆర్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన యువ కమ్యూనిస్టుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

సమ్మేళనంలో సీపీఎం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టిందని ఆరోపించారు. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును హైదరాబాద్‌లోని ఓ రోడ్డుకు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు.

రాజ్యసభ సభ్యుడు రహీం మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగాయని, గ్రామీణ ప్రాంతాలకు ఊతమిచ్చే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు.

జాన్ వెస్లీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను సీపీఎం నిరంతరం ప్రశ్నిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

సమసమాజ స్థాపన కోసం యువత రాజకీయాల్లోకి రావాలని, సీపీఎం బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చంద్రమోహన్, తొట రమేశ్, పగడాల యాదయ్య, కట్ట శ్రీనివాస్, కీసరి నర్సిరెడ్డి తదితరులతో పాటు డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News