మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నూతన కోర్సులను ప్రవేశపెట్టాలి..
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నూతన కోర్సులను ప్రవేశపెట్టాలి..
NM Yadav
ఎమ్జీయూ ఉపకులపతికి వినతిపత్రం అందజేసిన ఏబీవీపీ ప్రతినిధులు..
నల్గొండ : మహాత్మా గాంధీ యూనివర్సిటీ (ఎమ్జీయూ)లో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రారంభించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) యూనివర్సిటీ శాఖ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మంగళవారం యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ యూనివర్సిటీ కార్యదర్శి మోహన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన ఉన్నత విద్యను అందించడంలో ఎమ్జీయూ ఇతర వర్సిటీలకు ధీటుగా ముందు వరుసలో నిలుస్తోందని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైక ప్రభుత్వ విద్యా సంస్థ ఇదేనని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న కోర్సులకు అదనంగా విద్యార్థుల ఆకాంక్షల మేరకు మరిన్ని కొత్త కోర్సులను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. వర్సిటీలో హిందీ, సంస్కృతం, యోగా, ఎంఏ (పొలిటికల్ సైన్స్), ఫిలాసఫీ, సోషియాలజీ, లిటరేచర్, జర్నలిజం వంటి కోర్సులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు ఎమ్మెస్సీ జువాలజీ, మైక్రో బయాలజీ, ఫారెస్ట్రీ, ఎమ్మేడ్, బీఎడ్, ఎంపైడ్, బీపెడ్ మరియు బీటెక్ కోర్సులను ప్రవేశపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్, సంపత్, మౌనేష్ చారి, విజయ్, వెంకటేష్, సతీష్, సూర్య, అజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి