తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర క్రమశిక్షణ కమిటీలో బూరుగు వెంకటేశం
తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర క్రమశిక్షణ కమిటీలో బూరుగు వెంకటేశం
Editor Desk
: రామన్నపేట మండల కేంద్రానికి చెందిన బూరుగు వెంకటేశంను తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమ్మోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
బూరుగు వెంకటేశం రామన్నపేట పట్టణ, మండల పద్మశాలి సంఘాల ఏర్పాటు, బలోపేతంలో కీలక పాత్ర పోషించడంతో పాటు చేనేత వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయనను క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నియమించడం పట్ల స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు రచ్చ యాదగిరి, డీసీఎంఎస్ మాజీ జిల్లా డైరెక్టర్, రామన్నపేట కాటన్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు జేల్ల వెంకటేష్, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కైరంకొండ నాగభూషణ్తో పాటు రవ్వ నరసింహ, రవ్వ సత్యనారాయణ, మహేశ్వరం అశోక్, కైరంకొండ నందు, చలమల గోపాల్ తదితరులు వెంకటేశంకు శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి