* జార్ఖండ్, ఉత్తరాఖండ్ తరహాలో సంక్షేమ పథకాలు అందించాలి
* మునుగోడు నియోజకవర్గ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు పెద్దగోని రమేష్ గౌడ్
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, సముచితంగా గౌరవించేందుకు ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు ఆధ్వర్యంలోని కమిటీ మార్గదర్శకాలు రూపకల్పన చేస్తుండటంపై మునుగోడు నియోజకవర్గ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు పెద్దగోని రమేష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉద్యమకారులకు ఇస్తున్న పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న 5% మరియు 10% సమాంతర రిజర్వేషన్ల పాలసీలను కమిటీ అధ్యయనం చేస్తుండటం అభినందనీయమన్నారు. తెలంగాణలోనూ అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు, వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించాలని ఆయన కోరారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి