వరసిద్ధి వినాయక ఆలయంలో నూతన భవనం ప్రారంభం
వరసిద్ధి వినాయక ఆలయంలో నూతన భవనం ప్రారంభం
Editor Desk
ఎల్బీనగర్, : కొత్తపేట డివిజన్ పరిధిలోని గాయత్రిపురం కాలనీలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో నూతన భవనం, ప్రధాన ద్వారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తపేట మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్కుమార్ ప్రత్యేక పూజల్లో పాల్గొని నూతన భవనం, ప్రధాన ద్వారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న కమిటీ సభ్యులు, దాతలను అభినందించారు. కాలనీవాసులు, దాతల సహకారంతో ఆలయం అభివృద్ధి చెందడం సంతోషకరమన్నారు.
ఆలయ కమిటీ అధ్యక్షుడు దుద్దిల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ దాతల సహకారం, స్థానికుల కృషితో శ్రీ వరసిద్ధి వినాయక, సద్గురు సాయిబాబా ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఆలయ మరింత అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావాలని కోరారు.
రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉండగా అత్యవసర సమావేశాల కారణంగా రాలేకపోయారని, బుధవారం ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉన్నట్లు ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి.
కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు మంచి రాజేష్కుమార్, వెంకట్రెడ్డి, గాయత్రిపురం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు నవీన్కుమార్, అనంతరాములు, జే. బాలరాజు, జితేందర్రెడ్డి, శ్రీకాంత్, డాక్టర్ రాజయ్య గుప్త తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి