Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిట్టంపల్లి వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 17, 2026 03:08 PM

వరసిద్ధి వినాయక ఆలయంలో నూతన భవనం ప్రారంభం

వరసిద్ధి వినాయక ఆలయంలో నూతన భవనం ప్రారంభం

వరసిద్ధి వినాయక ఆలయంలో నూతన భవనం ప్రారంభం
June 16, 2026 08:47 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్, : కొత్తపేట డివిజన్ పరిధిలోని గాయత్రిపురం కాలనీలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో నూతన భవనం, ప్రధాన ద్వారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తపేట మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్‌కుమార్ ప్రత్యేక పూజల్లో పాల్గొని నూతన భవనం, ప్రధాన ద్వారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న కమిటీ సభ్యులు, దాతలను అభినందించారు. కాలనీవాసులు, దాతల సహకారంతో ఆలయం అభివృద్ధి చెందడం సంతోషకరమన్నారు.

ఆలయ కమిటీ అధ్యక్షుడు దుద్దిల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ దాతల సహకారం, స్థానికుల కృషితో శ్రీ వరసిద్ధి వినాయక, సద్గురు సాయిబాబా ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఆలయ మరింత అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావాలని కోరారు.

రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉండగా అత్యవసర సమావేశాల కారణంగా రాలేకపోయారని, బుధవారం ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉన్నట్లు ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి.

కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు మంచి రాజేష్‌కుమార్, వెంకట్‌రెడ్డి, గాయత్రిపురం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు నవీన్‌కుమార్, అనంతరాములు, జే. బాలరాజు, జితేందర్‌రెడ్డి, శ్రీకాంత్, డాక్టర్ రాజయ్య గుప్త తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News