Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 12:56 PM

పట్నంలో ప్రైవేట్ బడి వద్దు.. పల్లెలో ప్రభుత్వ బడే ముద్దు!

పట్నంలో ప్రైవేట్ బడి వద్దు.. పల్లెలో ప్రభుత్వ బడే ముద్దు!

పట్నంలో ప్రైవేట్ బడి వద్దు.. పల్లెలో ప్రభుత్వ బడే ముద్దు!
June 09, 2026 07:33 PM 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* మన ఊరి బడిలోనే నాణ్యమైన విద్య

* ఈ ఏడాది నుంచే ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు

* పీపల్ పహాడ్ సర్పంచ్ పులనగారి నాగేశ్వరి అశ్విన్ కుమార్ పిలుపు

పసిప్రాయం నుంచే పిల్లాపాపలను బస్సుల్లో వేసి ఎక్కడో దూరంగా ఉన్న పట్నం ప్రైవేటు పాఠశాలలకు పంపించవద్దని, మన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పీపల్ పహాడ్ సర్పంచ్ పులనగారి నాగేశ్వరి అశ్విన్ కుమార్ గ్రామస్తులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. మన ఊరి బడిలో కార్పొరేట్ స్థాయికి దీటుగా నాణ్యమైన విద్య అందుతోందని చెప్పారు.

​వంద శాతం ఫలితాలే నిదర్శనం..​గత పదవ తరగతి ఫలితాల్లో తమ గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే ఇక్కడి విద్యా ప్రమాణాలకు నిదర్శనమని సర్పంచ్ కొనియాడారు. ఈ అద్భుతమైన ఫలితాల సాధనకు రాత్రింబవళ్లు కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి ఆమె ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

​మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సహకారంతో ఈ విద్యా సంవత్సరం నుంచే మన పాఠశాలలో ప్రీ-ప్రైమరీ (LKG, UKG) తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.​గ్రామంలో విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తే.. రాబోయే రోజుల్లో గ్రామంలోనే 'ఇంటర్మీడియట్ కాలేజీ'ని ఏర్పాటు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, అది తన కల అని ఆమె ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News