Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:05 PM

ప్రభుత్వ దవాఖానాలలో ప్రజలకు సరియైన వైద్యం అందాలి; కొలిశెట్టి యాదగిరిరావు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు

ప్రభుత్వ దవాఖానాలలో ప్రజలకు సరియైన వైద్యం అందాలి; కొలిశెట్టి యాదగిరిరావు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు

ప్రభుత్వ దవాఖానాలలో ప్రజలకు సరియైన వైద్యం అందాలి;   కొలిశెట్టి యాదగిరిరావు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు
June 09, 2026 06:01 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


ప్రభుత్వ దవాఖానాలో ప్రజలకు సరైన సమయంలో వైద్యం జరిగి ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా ఉండాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు కోరారు. మంగళవారంసిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ప్రభుత్వ దవాఖానాలలో పేదలకు వైద్యం అందాలి కార్పొరేట్ వైద్యం కాదు ప్రజలకు అన్ని రకాల వైద్యం అందే విధంగా ప్రభుత్వ దవాఖానాలు ఉపయోగపడాలని కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తి మండలం లోని ప్రభుత్వ దవాఖానాలో సిపిఎం పార్టీ నాయకులు వైద్యశాలను పరిశీలించి సరైన వైద్యం అందుతుందా లేదా సిబ్బంది ఉన్నారా లేదా అనే విషయంలో తెలుసుకొని పార్టీ రాష్ట్ర సభ్యుడు యాదగిరి రావు గారు మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానాలు ప్రజలకు రక్షణగా ఉండాలి పేద మధ్యతరగతి ప్రజలు వైద్యానికి కార్పొరేటు వైద్యశాలలో డబ్బులు కట్టలేక ఆర్థికంగా భౌతికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ రకాల కు సంబంధించిన వైద్యులను నియమించాలని అన్ని రకాల మందులు దవాఖాలలో ఉండాలని ఆయన కోరారు తుంగతుర్తి ప్రభుత్వ వైద్యశాలలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న 26 మంది స్టాఫ్ నర్స్ ఉండేదానికి కేవలం కొద్దిమంది మాత్రమే సిబ్బంది ఉండటం వల్ల ప్రజలకు తగిన వైద్యం అందలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్న ఐదుగురు డాక్టర్లలో ముగ్గురు డిప్టేషన్ మీద ఇద్దరు కాంట్రాక్టు వైద్యులు ఉన్నందువల్ల వచ్చిన వారికి వైద్యవసరిగా అందలేదని అన్నారు ప్రభుత్వ దవాఖానాల్లో పూర్తిగా సిబ్బందిని నియమించి అన్ని రకాల వసతులతో ప్రజలకు సేవలు అందించే విధంగా ఉపయోగపడాలని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే మిషన్ ఖరాబ్ అయిందని చిన్నపిల్లల డాక్టర్ లేడని గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు దూర ప్రాంతాన్ని పోవడం జరుగుతుందని వెంటనే అట్టి పోస్టులను నింపాలని అన్నారు సిపిఎం పార్టీ ప్రజల రక్షణ కోసం ప్రభుత్వ దవాఖానాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండే విధంగా అధికారులు దృష్టి పెట్టాలని వారు కోరారు


ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాసు మండల కమిటీ సభ్యులు వల్ల సుదర్శన్ ఉప్పుల సోమయ్య జాజుగాల్ల ముత్తయ్య గడ్డం ఎల్లయ్య మడిపేది యాదగిరి కందుకూరి చంద్రయ్య మరియు వైద్యులు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News