Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:57 PM

మానూర్ మండలంలో మూడు ప్రీ-ప్రైమరీ కేంద్రాలకు ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులు

మానూర్ మండలంలో మూడు ప్రీ-ప్రైమరీ కేంద్రాలకు ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులు

మానూర్ మండలంలో మూడు ప్రీ-ప్రైమరీ కేంద్రాలకు ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులు
08-06-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మానూర్ మండలంలో కొత్తగా మంజూరైన ఎంపీపీఎస్ బోరంచ, ఎంపీపీఎస్ షేలిగిరా, ఎంపీయూపీఎస్ అతిమ్యాల పాఠశాలల ప్రీ-ప్రైమరీ తరగతుల కోసం ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మండల విద్యాశాఖాధికారి రాజశేఖర్ షేట్కార్ తెలిపారు. అర్హత కలిగిన స్థానిక అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. గ్రామం,పరిధిలోని స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనుండగా, అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎంపికైన ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు రూ.8,000, ఆయాలకు రూ.6,000 గౌరవ వేతనం అందజేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా విడుదల ప్రక్రియలు జూన్ 9 నుంచి జూన్ 16 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ఎంఈఓ కార్యాలయంలో పూర్తి వివరాలు తెలుసుకుని గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని రాజశేఖర్ షేట్కార్ సూచించారు.

Sthanikam

మానూర్ మండలంలో మూడు ప్రీ-ప్రైమరీ కేంద్రాలకు ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులు

Article Image

మానూర్ మండలంలో కొత్తగా మంజూరైన ఎంపీపీఎస్ బోరంచ, ఎంపీపీఎస్ షేలిగిరా, ఎంపీయూపీఎస్ అతిమ్యాల పాఠశాలల ప్రీ-ప్రైమరీ తరగతుల కోసం ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మండల విద్యాశాఖాధికారి రాజశేఖర్ షేట్కార్ తెలిపారు. అర్హత కలిగిన స్థానిక అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. గ్రామం,పరిధిలోని స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనుండగా, అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎంపికైన ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు రూ.8,000, ఆయాలకు రూ.6,000 గౌరవ వేతనం అందజేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా విడుదల ప్రక్రియలు జూన్ 9 నుంచి జూన్ 16 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ఎంఈఓ కార్యాలయంలో పూర్తి వివరాలు తెలుసుకుని గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని రాజశేఖర్ షేట్కార్ సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News