మానూర్ మండలంలో మూడు ప్రీ-ప్రైమరీ కేంద్రాలకు ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులు
మానూర్ మండలంలో మూడు ప్రీ-ప్రైమరీ కేంద్రాలకు ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులు
Krishna
మానూర్ మండలంలో కొత్తగా మంజూరైన ఎంపీపీఎస్ బోరంచ, ఎంపీపీఎస్ షేలిగిరా, ఎంపీయూపీఎస్ అతిమ్యాల పాఠశాలల ప్రీ-ప్రైమరీ తరగతుల కోసం ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మండల విద్యాశాఖాధికారి రాజశేఖర్ షేట్కార్ తెలిపారు. అర్హత కలిగిన స్థానిక అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. గ్రామం,పరిధిలోని స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనుండగా, అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎంపికైన ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లకు నెలకు రూ.8,000, ఆయాలకు రూ.6,000 గౌరవ వేతనం అందజేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా విడుదల ప్రక్రియలు జూన్ 9 నుంచి జూన్ 16 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ఎంఈఓ కార్యాలయంలో పూర్తి వివరాలు తెలుసుకుని గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని రాజశేఖర్ షేట్కార్ సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి