బావిలో పడిపోయిన మృత్యుంజయుడు మేకల కాపరిని కాపాడిన 108 సిబ్బంది
బావిలో పడిపోయిన మృత్యుంజయుడు మేకల కాపరిని కాపాడిన 108 సిబ్బంది
Sthanikam District Staff Reporter
అగ్నిమాపక సిబ్బంది పోలీస్ సిబ్బంది సహాయంతో ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలింపు
మేక పిల్లను కాపాడబోయి బావిలో పడిన మేకల కాపరి రాములు
మోటకొండూరు:మండలం గ్రామం కొండాపూర్ గ్రామానికి ఘటనకి 108 సమాచారం అందగానే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని 108 సిబ్బంది అంగడి రాములు 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి మేక పిల్ల బాయిలో పడడం వలన దానిని కాపాడబోయి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలోప్రమాదవశాత్తు బాయిలో జారి పడడం జరిగింది.అటు వైపుగా వెళుతున్న ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే 108కి ఫైర్ సిబ్బందికి పోలీస్ వారికి సమాచారం అందించడం జరిగింది సంఘటన స్థలానికి చేరుకున్న108అగ్ని మాపక సిబ్బంది చొరవతో బావిలోకి నిచ్చెనను ఏర్పాటు చేసి రాములును అతి జాగ్రత్తగా బయటకు తీయడం జరిగింది బావిలో పడిపోయిన రాములు కు గాయాలు కావడం వలన 108 అంబులెన్స్ లో మెరుగైన ప్రథమ చికిత్సను అందిస్తూ బోనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. సరియైన సమయంలో స్పందించిన 108 సిబ్బందికి అగ్నిమాపక సిబ్బందికి బావిలో పడిపోయి ఉన్న రాములు ప్రాణాలను కాపాడినందుకు అక్కడికి వచ్చిన ప్రజలు,గ్రామస్తులు గ్రామపంచాయతీ సిబ్బంది అభినందనలు తెలియజేయడం జరిగింది ప్రస్తుతం రాములు యొక్క ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. ఈ సంఘటన స్థలానికి 108 సిబ్బంది ఆలేటి పైలెట్ మహేందర్ రెడ్డి ఈఎంటి ఆళ్లకుంట రాకేష్ లను అభినందించి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి