Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:55 PM

నల్లపోచమ్మ తల్లి సన్నిధిలో వెండి కిరీటం సమర్పించిన భక్త కుటుంబం

నల్లపోచమ్మ తల్లి సన్నిధిలో వెండి కిరీటం సమర్పించిన భక్త కుటుంబం

నల్లపోచమ్మ తల్లి సన్నిధిలో వెండి కిరీటం సమర్పించిన భక్త కుటుంబం
09-06-2026 151 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో వెలసిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి హైదరాబాద్ బేగంబజార్ వాస్తవ్యులు రాయికోడ్ బాలాజీ–కళావతి దంపతులు తమ కుటుంబ సభ్యులు అశ్విని, నరేందర్, లావణ్య, రవీందర్‌లతో కలిసి మొక్కుబడి తీర్చుకుంటూ 480 గ్రాముల వెండి కిరీటాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆశీర్వదించారు. భక్తులు సమర్పించిన వెండి కిరీటాన్ని ఆలయానికి అందజేసిన విషయాన్ని ఆలయ ఈవో శివ రుద్రప్పకు తెలియజేశారు. భక్తి, విశ్వాసాలకు ప్రతీకగా వెండి కిరీటం సమర్పించిన ఈ కుటుంబాన్ని ఆలయ నిర్వాహకులు, భక్తులు అభినందించారు.

Sthanikam

నల్లపోచమ్మ తల్లి సన్నిధిలో వెండి కిరీటం సమర్పించిన భక్త కుటుంబం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో వెలసిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి హైదరాబాద్ బేగంబజార్ వాస్తవ్యులు రాయికోడ్ బాలాజీ–కళావతి దంపతులు తమ కుటుంబ సభ్యులు అశ్విని, నరేందర్, లావణ్య, రవీందర్‌లతో కలిసి మొక్కుబడి తీర్చుకుంటూ 480 గ్రాముల వెండి కిరీటాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆశీర్వదించారు. భక్తులు సమర్పించిన వెండి కిరీటాన్ని ఆలయానికి అందజేసిన విషయాన్ని ఆలయ ఈవో శివ రుద్రప్పకు తెలియజేశారు. భక్తి, విశ్వాసాలకు ప్రతీకగా వెండి కిరీటం సమర్పించిన ఈ కుటుంబాన్ని ఆలయ నిర్వాహకులు, భక్తులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News