నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో వెలసిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి హైదరాబాద్ బేగంబజార్ వాస్తవ్యులు రాయికోడ్ బాలాజీ–కళావతి దంపతులు తమ కుటుంబ సభ్యులు అశ్విని, నరేందర్, లావణ్య, రవీందర్లతో కలిసి మొక్కుబడి తీర్చుకుంటూ 480 గ్రాముల వెండి కిరీటాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆశీర్వదించారు. భక్తులు సమర్పించిన వెండి కిరీటాన్ని ఆలయానికి అందజేసిన విషయాన్ని ఆలయ ఈవో శివ రుద్రప్పకు తెలియజేశారు. భక్తి, విశ్వాసాలకు ప్రతీకగా వెండి కిరీటం సమర్పించిన ఈ కుటుంబాన్ని ఆలయ నిర్వాహకులు, భక్తులు అభినందించారు.
PRINT TIME: August 06, 2026 10:55 PM
నల్లపోచమ్మ తల్లి సన్నిధిలో వెండి కిరీటం సమర్పించిన భక్త కుటుంబం
నల్లపోచమ్మ తల్లి సన్నిధిలో వెండి కిరీటం సమర్పించిన భక్త కుటుంబం
09-06-2026
151 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో వెలసిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి హైదరాబాద్ బేగంబజార్ వాస్తవ్యులు రాయికోడ్ బాలాజీ–కళావతి దంపతులు తమ కుటుంబ సభ్యులు అశ్విని, నరేందర్, లావణ్య, రవీందర్లతో కలిసి మొక్కుబడి తీర్చుకుంటూ 480 గ్రాముల వెండి కిరీటాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆశీర్వదించారు. భక్తులు సమర్పించిన వెండి కిరీటాన్ని ఆలయానికి అందజేసిన విషయాన్ని ఆలయ ఈవో శివ రుద్రప్పకు తెలియజేశారు. భక్తి, విశ్వాసాలకు ప్రతీకగా వెండి కిరీటం సమర్పించిన ఈ కుటుంబాన్ని ఆలయ నిర్వాహకులు, భక్తులు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి