Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 06:42 AM

ఇంద్రపాలనగరంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ.

ఇంద్రపాలనగరంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ.

ఇంద్రపాలనగరంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.  పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ.
02-06-2026 334 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేందర్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ–స్వామి, వార్డు సభ్యులు చిన్నలచ్చి శంకరమ్మ, కప్పల మంగమ్మ, పుట్టల లక్ష్మమ్మ, ముత్యాలు, అమినొద్దిన్, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్‌వాడీ సిబ్బంది, సీనియర్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ.

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేందర్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ–స్వామి, వార్డు సభ్యులు చిన్నలచ్చి శంకరమ్మ, కప్పల మంగమ్మ, పుట్టల లక్ష్మమ్మ, ముత్యాలు, అమినొద్దిన్, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్‌వాడీ సిబ్బంది, సీనియర్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News