ఇంద్రపాలనగరంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ.
ఇంద్రపాలనగరంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ.
Editor Desk
రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేందర్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ–స్వామి, వార్డు సభ్యులు చిన్నలచ్చి శంకరమ్మ, కప్పల మంగమ్మ, పుట్టల లక్ష్మమ్మ, ముత్యాలు, అమినొద్దిన్, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ సిబ్బంది, సీనియర్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి