విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం అవసరం: బోరంచ బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే
విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం అవసరం: బోరంచ బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యాభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు యశ్వంత్, ఉపాధ్యాయులు మహేష్ కుమార్, అశోక్ రావు, శ్రీధర్, విఠల్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యురాలు సాయమ్మ, అంగన్వాడీ టీచర్లు, గ్రామ మహిళా సమాఖ్య వీఓఏ అనుసుయతో పాటు గ్రామస్తులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి