జనగణన–2027 సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
జనగణన–2027 సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
Vikram Journalist
జనగణన–2027 సర్వే దేశాభివృద్ధికి కీలకమైన ప్రక్రియ అని, ప్రజలందరూ ఎన్యుమరేటర్లకు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చినట్లు తెలిపారు. బుధవారం జనగణన–2027 సర్వే ప్రక్రియలో భాగంగా అధికారులు కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి జిల్లా కలెక్టర్ వివరాల నమోదు, ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన ద్వారా సేకరించే గణాంకాలు ప్రభుత్వ విధానాల రూపకల్పన, సంక్షేమ పథకాల అమలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నట్లు తెలిపారు. ఇంటింటికి వచ్చే సర్వే సిబ్బందికి ప్రజలు సరైన సమాచారం అందించి జనగణన విజయవంతం కావడానికి సహకరించాలని సూచించినట్లు తెలిపారు.
ప్రజలు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా సర్వేలో పాల్గొని తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలని కోరినట్లు తెలిపారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న సిబ్బందిని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించినట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి