ఆగస్టు 10న జైలు భరోను విజయవంతం చేయాలి. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి పిలుపు.
ఆగస్టు 10న జైలు భరోను విజయవంతం చేయాలి. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి పిలుపు.
Editor Desk
రామన్నపట
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహించే జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు.స్థానిక సీపీఎం కార్యాలయంలో జరిగిన మండల సదస్సులో వారు మాట్లాడుతూ, కార్మిక హక్కులను బలహీనపరచడం, రైతు సమస్యలను నిర్లక్ష్యం చేయడం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం వంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టే జైలు భరోలో కార్మికులు, రైతులు, కూలీలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగే సోములు, సహాయ కార్యదర్శి నకిరకంటి రాము, జిల్లా కమిటీ సభ్యుడు బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి గన్నేబోయిన విజయభాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మేడి ముకుంద్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్, గీత కార్మిక సంఘం, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి