PRINT TIME: July 20, 2026 09:09 AM
రవీంద్రభారతిలో బంగారు నంది అవార్డుల ప్రదానం. జాతీయ పురస్కారం అందుకున్న డా. కాశీనాథేశ్వర రాజ్కుమార్ రెడ్డి.
రవీంద్రభారతిలో బంగారు నంది అవార్డుల ప్రదానం. జాతీయ పురస్కారం అందుకున్న డా. కాశీనాథేశ్వర రాజ్కుమార్ రెడ్డి.
July 19, 2026 07:17 PM
465 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్, జూలై 19: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు, బోనాల పండుగ సందర్భంగా రవీంద్రభారతిలో జాతీయ బంగారు నంది అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను ఈ సందర్భంగా నేషనల్ బంగారు నంది అవార్డులతో సత్కరించారు.
సమాజ సేవ, సాంస్కృతిక రంగానికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా డా. కాశీనాథేశ్వర రాజ్కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మక జాతీయ బంగారు నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను అభినందించారు.
ఈ కార్యక్రమాన్ని జి.సి.ఎస్. వల్లూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ డా. వి.ఆర్. శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. వేడుకకు వివిధ రంగాల ప్రముఖులు, సాంస్కృతిక రంగ ప్రతినిధులు, కళాకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి