Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రారంభానికి సిద్ధమైన మర్రిగూడ ఫ్లైఓవర్‌ను వెంటనే ప్రారంభించాలి: మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాస్తారోకో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 18, 2026 10:22 PM

భూ వివాదాలకు చెక్..! నిధానపల్లిలో భూముల రీ-సర్వే ప్రారంభం

భూ వివాదాలకు చెక్..! నిధానపల్లిలో భూముల రీ-సర్వే ప్రారంభం

భూ వివాదాలకు చెక్..! నిధానపల్లిలో భూముల రీ-సర్వే ప్రారంభం
July 18, 2026 08:04 PM 100 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆధునిక సాంకేతికతతో భూ సరిహద్దుల నిర్ధారణ..

రామన్నపేట నిదానపల్లి

భూ రికార్డుల్లో పారదర్శకత, భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీ-సర్వే కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో శనివారం ప్రారంభమైంది. మండల తహసీల్దార్ లాల్ బహదూర్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నారాపాక మాధవి యాదయ్య మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల సరిహద్దులను ఖచ్చితంగా నిర్ధారించి, పారదర్శకమైన భూ రికార్డులను రూపొందించడమే రీ-సర్వే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రీ-సర్వే పూర్తయితే భూ వివాదాలకు తెరపడటంతో పాటు ప్రతి భూ యజమానికి స్పష్టమైన హక్కుల నమోదు జరిగే అవకాశముందని పేర్కొన్నారు.

రైతులు, భూ యజమానులు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు తదితర భూ పత్రాలతో సర్వే బృందానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. సర్వే అనంతరం ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే నిర్ణీత గడువులో సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ప్రజలకు ఖచ్చితమైన, పారదర్శకమైన భూ రికార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది శోభ, వెంకటేశ్వర్లు, స్వప్న, లక్ష్మీదేవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుత్తా నర్సిరెడ్డి, సింగిరెడ్డి మల్లారెడ్డి, రామన్నపేట పోలీసు సిబ్బంది, ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్య, వార్డు సభ్యులు బాషమల్ల అనిత, సంతోష్, వంగాల పూజిత, ఏకుల మల్లేష్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News