భూ వివాదాలకు చెక్..! నిధానపల్లిలో భూముల రీ-సర్వే ప్రారంభం
భూ వివాదాలకు చెక్..! నిధానపల్లిలో భూముల రీ-సర్వే ప్రారంభం
Editor Desk
ఆధునిక సాంకేతికతతో భూ సరిహద్దుల నిర్ధారణ..
రామన్నపేట నిదానపల్లి
భూ రికార్డుల్లో పారదర్శకత, భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీ-సర్వే కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో శనివారం ప్రారంభమైంది. మండల తహసీల్దార్ లాల్ బహదూర్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నారాపాక మాధవి యాదయ్య మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల సరిహద్దులను ఖచ్చితంగా నిర్ధారించి, పారదర్శకమైన భూ రికార్డులను రూపొందించడమే రీ-సర్వే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రీ-సర్వే పూర్తయితే భూ వివాదాలకు తెరపడటంతో పాటు ప్రతి భూ యజమానికి స్పష్టమైన హక్కుల నమోదు జరిగే అవకాశముందని పేర్కొన్నారు.
రైతులు, భూ యజమానులు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు తదితర భూ పత్రాలతో సర్వే బృందానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. సర్వే అనంతరం ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే నిర్ణీత గడువులో సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ప్రజలకు ఖచ్చితమైన, పారదర్శకమైన భూ రికార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది శోభ, వెంకటేశ్వర్లు, స్వప్న, లక్ష్మీదేవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుత్తా నర్సిరెడ్డి, సింగిరెడ్డి మల్లారెడ్డి, రామన్నపేట పోలీసు సిబ్బంది, ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్య, వార్డు సభ్యులు బాషమల్ల అనిత, సంతోష్, వంగాల పూజిత, ఏకుల మల్లేష్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి