డిగ్రీ అడ్మిషన్లకు మరో చాన్స్..! దోస్త్ స్పెషల్ ఫేజ్కు ఈ నెల 20 నుంచి రిజిస్ట్రేషన్.. 26తో గడువు ముగింపు ప్రిన్సిపాల్ రాహత్ ఖానం
డిగ్రీ అడ్మిషన్లకు మరో చాన్స్..! దోస్త్ స్పెషల్ ఫేజ్కు ఈ నెల 20 నుంచి రిజిస్ట్రేషన్.. 26తో గడువు ముగింపు ప్రిన్సిపాల్ రాహత్ ఖానం
Editor Desk
డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు మరో అవకాశం లభించింది. 2026–27 విద్యా సంవత్సరానికి దోస్త్ (DOST) స్పెషల్ ఫేజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం తెలిపారు.
ఇప్పటివరకు ఏ కళాశాలలోనూ సీటు పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. డిగ్రీలో ప్రవేశం పొందాలనుకునే వారు నేరుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, లేదా మీసేవ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి" అని ప్రిన్సిపాల్ రాహత్ ఖానం విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక దశను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి