PRINT TIME: July 18, 2026 06:27 PM
రక్తదానమే ప్రాణదానం..! 86 మంది ఉద్యోగుల స్వచ్ఛంద రక్తదానం. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి: అదనపు కలెక్టర్ భాస్కరరావు
రక్తదానమే ప్రాణదానం..! 86 మంది ఉద్యోగుల స్వచ్ఛంద రక్తదానం. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి: అదనపు కలెక్టర్ భాస్కరరావు
July 18, 2026 04:11 PM
15 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
భువనగిరి,
రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు. కలెక్టరేట్లో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో, పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ విద్యానగర్ రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో పంచాయతీరాజ్ శాఖకు చెందిన 86 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
రెడ్క్రాస్ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాములు మాట్లాడుతూ, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో త్వరలోనే 9వ రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి