Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండకు వెంటనే పూర్తి స్థాయి మున్సిపల్ కమిషనర్‌ను నియమించాలి: CM రేవంత్ రెడ్డికి BJP OBC మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్ బహిరంగ లేఖ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 17, 2026 08:42 PM

సరూర్‌నగర్ సభను విజయవంతం చేయాలి. కాంగ్రెస్ ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి: బీఆర్ఎస్ నాయకుడు రుద్రాల స్వామి

సరూర్‌నగర్ సభను విజయవంతం చేయాలి. కాంగ్రెస్ ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి: బీఆర్ఎస్ నాయకుడు రుద్రాల స్వామి

సరూర్‌నగర్ సభను విజయవంతం చేయాలి.  కాంగ్రెస్ ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి: బీఆర్ఎస్ నాయకుడు రుద్రాల స్వామి
July 17, 2026 07:19 PM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న **'యువ సంగ్రామ సదస్సు'**ను విజయవంతం చేయాలని ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు రుద్రాల స్వామి పిలుపునిచ్చారు.

శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యోగాల భర్తీ, యూత్ డిక్లరేషన్ హామీల అమలే ఈ సదస్సు ప్రధాన అజెండా అని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సభలో యువతకు సంబంధించిన కీలక అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం ఉండనున్న నేపథ్యంలో నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.

దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగ యువత చేపడుతున్న ఉద్యమానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నిరంతరం సంఘీభావం తెలుపుతూ వారి పక్షాన పోరాడుతున్నారని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం, ముఖ్యంగా 20 వేల పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించడం వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తుందని రుద్రాల స్వామి స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం ఈ సభ ఒక కీలక వేదిక కానుందని, యువత పెద్దఎత్తున పాల్గొని తమ గళాన్ని వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News