సరూర్నగర్ సభను విజయవంతం చేయాలి. కాంగ్రెస్ ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి: బీఆర్ఎస్ నాయకుడు రుద్రాల స్వామి
సరూర్నగర్ సభను విజయవంతం చేయాలి. కాంగ్రెస్ ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి: బీఆర్ఎస్ నాయకుడు రుద్రాల స్వామి
Editor Desk
ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించనున్న **'యువ సంగ్రామ సదస్సు'**ను విజయవంతం చేయాలని ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు రుద్రాల స్వామి పిలుపునిచ్చారు.
శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యోగాల భర్తీ, యూత్ డిక్లరేషన్ హామీల అమలే ఈ సదస్సు ప్రధాన అజెండా అని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సభలో యువతకు సంబంధించిన కీలక అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం ఉండనున్న నేపథ్యంలో నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.
దిల్సుఖ్నగర్లో నిరుద్యోగ యువత చేపడుతున్న ఉద్యమానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నిరంతరం సంఘీభావం తెలుపుతూ వారి పక్షాన పోరాడుతున్నారని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం, ముఖ్యంగా 20 వేల పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించడం వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తుందని రుద్రాల స్వామి స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం ఈ సభ ఒక కీలక వేదిక కానుందని, యువత పెద్దఎత్తున పాల్గొని తమ గళాన్ని వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి