డిగ్రీ ప్రవేశాలకు చివరి ఛాన్స్..!ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్.
డిగ్రీ ప్రవేశాలకు చివరి ఛాన్స్..!ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్.
Editor Desk
డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులకు దోస్త్ స్పెషల్ ఫేజ్ ద్వారా మరో అవకాశం లభించింది. రామన్నపేటలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కోర్సుల్లో ఇంకా కొన్ని సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు.
ఇప్పటి వరకు దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోని విద్యార్థులతో పాటు ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల్లో సీట్లు పొందని అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దోస్త్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జూలై 27న, సీట్ల కేటాయింపు జూలై 30న ఉంటుందని తెలిపారు. అదే రోజు నుంచి విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలని సూచించారు. స్పెషల్ ఫేజ్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
డిగ్రీలో చేరేందుకు ఇది చివరి అవకాశమని, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు 9989897566, 9985824737 నంబర్లను కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి