హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి!
హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి!
K.RAVI
ట్రాఫిక్ సీఐ నందగిరి వెంకటేశం
ట్రినిటీ హైస్కూల్లో రోడ్డు భద్రతా సదస్సు
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణాలకు రక్షణ ఉంటుందని చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ నందగిరి వెంకటేశం అన్నారు. పట్టణంలోని ట్రినిటీ హైస్కూల్లో శుక్రవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన పెంచుకోవాలని, ఇంట్లోని పెద్దలకు కూడా వీటిని వివరించాలని కోరారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని, మొబైల్స్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిపుల్ రైడింగ్ చేయకూడదని సూచించారు. మలుపుల వద్ద ఇండికేటర్లు వాడాలని, నో పార్కింగ్ జోన్లలో వాహనాలు నిలపవద్దన్నారు. అనంతరం విద్యార్థులతో ట్రాఫిక్ నిబంధనలపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీఐ నందగిరి వెంకటేశంను స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జిని మంజుల ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ హై స్కూల్ చైర్మన్ కే వి బి కృష్ణారావు, ప్రిన్సిపాల్ కం డైరెక్టర్ డాక్టర్ ఉజ్జిని మంజుల, ట్రాఫిక్ ఎస్ఐ జి సైదిరెడ్డి, ఆర్ ఎస్ ఐ ఆంజనేయులు, ఏఎస్ఐ జంగయ్య, ట్రాఫిక్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి