వర్షాల కోసం శంభు లింగేశ్వరుడికి సహస్ర కలశ జలాభిషేకం. వెల్లంకిలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్ ఈడెం రాధ శ్రీనివాస్.
వర్షాల కోసం శంభు లింగేశ్వరుడికి సహస్ర కలశ జలాభిషేకం. వెల్లంకిలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్ ఈడెం రాధ శ్రీనివాస్.
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ శ్రీశ్రీశ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సహస్ర కలశ జలాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు.గ్రామంలోని అన్ని రకాల పంటలు కరువు కోరల్లో చిక్కుకోవడంతో పాటు పశుసంపదకు మేత కొరత ఏర్పడిన నేపథ్యంలో గ్రామ రైతుల విజ్ఞప్తి మేరకు ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ తెలిపారు. భగవంతుని అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండిపోవడంతో పాటు రైతుల కష్టాలు తొలగి గ్రామం సస్యశ్యామలం కావాలనే సంకల్పంతో ఈ జలాభిషేకం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
గ్రామ ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ప్రతి కుటుంబం నీటి బిందె, పసుపు, కుంకుమ, వేప మండలు తీసుకుని కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి