Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వర్షాల కోసం శంభు లింగేశ్వరుడికి సహస్ర కలశ జలాభిషేకం. వెల్లంకిలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్ ఈడెం రాధ శ్రీనివాస్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 17, 2026 03:44 PM

వర్షాల కోసం శంభు లింగేశ్వరుడికి సహస్ర కలశ జలాభిషేకం. వెల్లంకిలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్ ఈడెం రాధ శ్రీనివాస్.

వర్షాల కోసం శంభు లింగేశ్వరుడికి సహస్ర కలశ జలాభిషేకం. వెల్లంకిలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్ ఈడెం రాధ శ్రీనివాస్.

వర్షాల కోసం శంభు లింగేశ్వరుడికి సహస్ర కలశ జలాభిషేకం.  వెల్లంకిలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్ ఈడెం రాధ శ్రీనివాస్.
July 17, 2026 02:43 PM 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ శ్రీశ్రీశ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సహస్ర కలశ జలాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు.గ్రామంలోని అన్ని రకాల పంటలు కరువు కోరల్లో చిక్కుకోవడంతో పాటు పశుసంపదకు మేత కొరత ఏర్పడిన నేపథ్యంలో గ్రామ రైతుల విజ్ఞప్తి మేరకు ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ తెలిపారు. భగవంతుని అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండిపోవడంతో పాటు రైతుల కష్టాలు తొలగి గ్రామం సస్యశ్యామలం కావాలనే సంకల్పంతో ఈ జలాభిషేకం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

గ్రామ ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ప్రతి కుటుంబం నీటి బిందె, పసుపు, కుంకుమ, వేప మండలు తీసుకుని కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News