రిక్షా కార్మికుడి అదృశ్యం.. ఆందోళనలో కుటుంబం!
రిక్షా కార్మికుడి అదృశ్యం.. ఆందోళనలో కుటుంబం!
K.RAVI
చౌటుప్పల్ మండల పరిధిలోని జై కేసారం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు అదృశ్యమైనట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం...గ్రామానికి చెందిన మోటే నాగయ్య (65, వృత్తి: రిక్షా కార్మికుడు)కు దాదాపు సంవత్సరం క్రితం ప్రమాదవశాత్తు కిందపడి కాలుకి తీవ్ర గాయమైంది. ఈ క్రమంలో గాయపడిన తన కాలును చూపించుకునేందుకు ఈ ఏడాది మార్చి 26వ తేదీన హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అప్పటి నుంచి నాగయ్య తిరిగి ఇంటికి రాలేదు.భర్త కోసం భార్య మోటే జంగమ్మ కుటుంబ సభ్యులతో కలిసి బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద, పలు ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం (జూలై 16న) ఆమె చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి. మన్మథ కుమార్ తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి