Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:30 AM

రిక్షా కార్మికుడి అదృశ్యం.. ఆందోళనలో కుటుంబం!

రిక్షా కార్మికుడి అదృశ్యం.. ఆందోళనలో కుటుంబం!

రిక్షా కార్మికుడి అదృశ్యం.. ఆందోళనలో కుటుంబం!
16-07-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండల పరిధిలోని జై కేసారం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు అదృశ్యమైనట్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం...​గ్రామానికి చెందిన మోటే నాగయ్య (65, వృత్తి: రిక్షా కార్మికుడు)కు దాదాపు సంవత్సరం క్రితం ప్రమాదవశాత్తు కిందపడి కాలుకి తీవ్ర గాయమైంది. ఈ క్రమంలో గాయపడిన తన కాలును చూపించుకునేందుకు ఈ ఏడాది మార్చి 26వ తేదీన హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అప్పటి నుంచి నాగయ్య తిరిగి ఇంటికి రాలేదు.​భర్త కోసం భార్య మోటే జంగమ్మ కుటుంబ సభ్యులతో కలిసి బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద, పలు ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం (జూలై 16న) ఆమె చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మథ కుమార్ తెలిపారు.

Sthanikam

రిక్షా కార్మికుడి అదృశ్యం.. ఆందోళనలో కుటుంబం!

Article Image

చౌటుప్పల్ మండల పరిధిలోని జై కేసారం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు అదృశ్యమైనట్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం...​గ్రామానికి చెందిన మోటే నాగయ్య (65, వృత్తి: రిక్షా కార్మికుడు)కు దాదాపు సంవత్సరం క్రితం ప్రమాదవశాత్తు కిందపడి కాలుకి తీవ్ర గాయమైంది. ఈ క్రమంలో గాయపడిన తన కాలును చూపించుకునేందుకు ఈ ఏడాది మార్చి 26వ తేదీన హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అప్పటి నుంచి నాగయ్య తిరిగి ఇంటికి రాలేదు.​భర్త కోసం భార్య మోటే జంగమ్మ కుటుంబ సభ్యులతో కలిసి బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద, పలు ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం (జూలై 16న) ఆమె చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మథ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News