PRINT TIME: July 16, 2026 02:35 AM
మల్కాపురం వద్ద బస్సులు ఢీ: పదిమందికి గాయాలు
మల్కాపురం వద్ద బస్సులు ఢీ: పదిమందికి గాయాలు
July 16, 2026 01:31 AM
1 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ మండలం మల్కాపురం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సులోని సుమారు పదిమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. తూప్రాన్పేట్ పోకర్ణ కంపెనీకి చెందిన బస్సు మల్కాపురం వద్ద యూటర్న్ తీసుకుంటుండగా.. హయత్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి