NOC కోసం లంచం.. ACB వలలో భూగర్భజల శాఖ అధికారులు
NOC కోసం లంచం.. ACB వలలో భూగర్భజల శాఖ అధికారులు
Komidala Mahender reddy
సూర్యాపేటలో అసిస్టెంట్ డైరెక్టర్, డేటా ఆపరేటర్ రెడ్హ్యాండెడ్గా పట్టివేత.
సూర్యాపేట, జూలై 15: బోర్వెల్కు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసీ) మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేసిన భూగర్భజల శాఖ అధికారులను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సూర్యాపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. బోర్వెల్ యజమాని నుంచి ఎన్ఓసీ మంజూరు కోసం రూ.20 వేల లంచం కోరిన భూగర్భజల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాలు నాయక్, డేటా ఆపరేటర్ వెంకటేశ్వర్లుపై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు నల్గొండ ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో వల పన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో ఇద్దరినీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని, సంబంధిత కార్యాలయంలో అవసరమైన పత్రాలు, రికార్డులను పరిశీలించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ప్రభుత్వ సేవలు అందించాల్సిన అధికారులు ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేయడం బాధాకరమని, అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరించారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి