Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:33 AM

NOC కోసం లంచం.. ACB వలలో భూగర్భజల శాఖ అధికారులు

NOC కోసం లంచం.. ACB వలలో భూగర్భజల శాఖ అధికారులు

NOC కోసం లంచం.. ACB వలలో భూగర్భజల శాఖ అధికారులు
15-07-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


సూర్యాపేటలో అసిస్టెంట్ డైరెక్టర్, డేటా ఆపరేటర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత.


సూర్యాపేట, జూలై 15: బోర్‌వెల్‌కు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేసిన భూగర్భజల శాఖ అధికారులను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సూర్యాపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. బోర్‌వెల్ యజమాని నుంచి ఎన్‌ఓసీ మంజూరు కోసం రూ.20 వేల లంచం కోరిన భూగర్భజల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాలు నాయక్, డేటా ఆపరేటర్ వెంకటేశ్వర్లుపై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు నల్గొండ ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో వల పన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని, సంబంధిత కార్యాలయంలో అవసరమైన పత్రాలు, రికార్డులను పరిశీలించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ప్రభుత్వ సేవలు అందించాల్సిన అధికారులు ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేయడం బాధాకరమని, అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరించారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Sthanikam

NOC కోసం లంచం.. ACB వలలో భూగర్భజల శాఖ అధికారులు

Article Image


సూర్యాపేటలో అసిస్టెంట్ డైరెక్టర్, డేటా ఆపరేటర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత.


సూర్యాపేట, జూలై 15: బోర్‌వెల్‌కు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేసిన భూగర్భజల శాఖ అధికారులను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సూర్యాపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. బోర్‌వెల్ యజమాని నుంచి ఎన్‌ఓసీ మంజూరు కోసం రూ.20 వేల లంచం కోరిన భూగర్భజల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాలు నాయక్, డేటా ఆపరేటర్ వెంకటేశ్వర్లుపై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు నల్గొండ ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో వల పన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని, సంబంధిత కార్యాలయంలో అవసరమైన పత్రాలు, రికార్డులను పరిశీలించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ప్రభుత్వ సేవలు అందించాల్సిన అధికారులు ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేయడం బాధాకరమని, అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరించారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News