Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ..భువనగిరిలో అవగాహన కార్యక్రమాలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 15, 2026 10:31 PM

నీటిని వృధా చేయొద్దు.. ఒడిసి పట్టుకోవాలి!

నీటిని వృధా చేయొద్దు.. ఒడిసి పట్టుకోవాలి!

నీటిని వృధా చేయొద్దు.. ఒడిసి పట్టుకోవాలి!
July 15, 2026 09:01 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

జడ్పీహెచ్ఎస్ తంగడపల్లిలో ‘జల సంవాద్’ కార్యక్రమం

విద్యార్థులతో ‘జల ప్రతిజ్ఞ’ చేయించిన మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్

ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రమాదం పొంచి ఉందని,అందువల్ల అందుబాటులో ఉన్న వర్షపు నీటిని,భూగర్భ జలాలను అత్యంత జాగ్రత్తగా వాడుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎన్.వెంకటేశ్వర నాయక్ పిలుపునిచ్చారు. జాతీయ జల మిషన్ ‘జల్ శక్తి అభియాన్ – క్యాచ్ ది రైన్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం తంగడపల్లి గ్రామ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో "జల ప్రతిజ్ఞ" కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ..ప్రతి నీటి బొట్టును వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.పాఠశాల విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఇంకుడు గుంతల ప్రాముఖ్యతను,వాటి నిర్మాణ ఆవశ్యకతను ఆయన ఈ సందర్భంగా వివరించారు.​ఇళ్లలో నీటిని వృధా చేయకుండా జాగ్రత్త వహించాలి. ​పైకప్పుపై ఉన్న సింటెక్స్ ట్యాంక్ నిండగానే మోటార్‌ను వెంటనే బంద్ చేయాలి.కింద ఉన్న సంప్ లేదా ట్యాంక్ నిండినప్పుడు నీటి పంపు వాల్‌ను మూసివేయాలి. ఈ విషయాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని, ఇంట్లో పెద్దలకు కూడా చెప్పి నీటి వృధాను అరికట్టాలని సూచించారు.​అనంతరం పాఠశాల విద్యార్థులందరితో నీటి పొదుపుపై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భార్గవి,పీఈటీ లింగయ్య, ఉపాధ్యాయ బృందం, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్,టీపీబీఓ సాయి కుమార్,జూనియర్ అకౌంటెంట్ శ్రీనాథ్,మున్సిపల్ సిబ్బంది,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News