Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:35 AM

రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ..భువనగిరిలో అవగాహన కార్యక్రమాలు

రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ..భువనగిరిలో అవగాహన కార్యక్రమాలు

రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ..భువనగిరిలో అవగాహన కార్యక్రమాలు
15-07-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

పగడిపల్లి,రాయగిరి గ్రామాల్లో రహదారి భద్రతపై భువనగిరి ట్రాఫిక్ పోలీస్ విస్తృత అవగాహన

భువనగిరి:జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, భువనగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ (టీఆర్‌పీఎస్) ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో భువనగిరి మండల పరిధిలోని పగడిపల్లి,రాయగిరి గ్రామాల్లో రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, నాలుగు చక్రాల వాహనాల్లో సీటుబెల్ట్ వినియోగించడం,మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, అతివేగాన్ని నివారించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ మరియు చట్ట అమలు పోలీసులు,ఆర్టీఏ అధికారులు, టోల్ ప్లాజా అధికారులు,గ్రామ ప్రజలు, ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొని రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు తమ వంతు సహకారం అందించారు. ప్రజల ప్రాణాలు అమూల్యమైనవని,ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ..భువనగిరిలో అవగాహన కార్యక్రమాలు

Article Image

పగడిపల్లి,రాయగిరి గ్రామాల్లో రహదారి భద్రతపై భువనగిరి ట్రాఫిక్ పోలీస్ విస్తృత అవగాహన

భువనగిరి:జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, భువనగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ (టీఆర్‌పీఎస్) ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో భువనగిరి మండల పరిధిలోని పగడిపల్లి,రాయగిరి గ్రామాల్లో రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, నాలుగు చక్రాల వాహనాల్లో సీటుబెల్ట్ వినియోగించడం,మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, అతివేగాన్ని నివారించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ మరియు చట్ట అమలు పోలీసులు,ఆర్టీఏ అధికారులు, టోల్ ప్లాజా అధికారులు,గ్రామ ప్రజలు, ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొని రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు తమ వంతు సహకారం అందించారు. ప్రజల ప్రాణాలు అమూల్యమైనవని,ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News