యాదాద్రి భువనగిరి జిల్లా
జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ ఆదేశాల మేరకు భువనగిరి ట్రాఫిక్ పోలీసులు బుధవారం పగిడిపల్లి,రాయగిరి గ్రామాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్,నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.మద్యం సేవించి వాహనాలు నడపరాదని,అతివేగం,నిర్లక్ష్యపు డ్రైవింగ్కు దూరంగా ఉండాలని,వాహనం నడుపుతూ సెల్ఫోన్ ఉపయోగించవద్దని అవగాహన కల్పించారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడుకోవచ్చని అధికారులు తెలిపారు.కార్యక్రమంలో ట్రాఫిక్,లా అండ్ ఆర్డర్ పోలీసులు,ఆర్టీఏ అధికారులు,టోల్ప్లాజా సిబ్బంది,గ్రామస్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి