| నల్లగొండ, |
ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కే–కే కమిటీ సమావేశానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమకారులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ చాంద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న, జిల్లా నాయకులు బొడ్డుపల్లి లింగయ్య, నోముల శంకర్ పిలుపునిచ్చారు. జూలై 17న హైదరాబాద్ సచివాలయం ఎదురుగా ఉన్న అమర జ్యోతి భవన్లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉద్యమకారులతో కే–కే కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యమకారులు తమ సలహాలు, సూచనలు కమిటీకి అందించే అవకాశం ఉన్నందున ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి