మహిళలకు న్యాయం చేయండి.. రిజర్వేషన్ బిల్లును అమలు చేయండి: మహిళా కాంగ్రెస్
మహిళలకు న్యాయం చేయండి.. రిజర్వేషన్ బిల్లును అమలు చేయండి: మహిళా కాంగ్రెస్
Krishna
జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం మన్నపూర్ గ్రామంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి పేరుతో పోస్ట్కార్డుల ఉద్యమం నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ, 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని, మహిళలకు రాజకీయాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును అమలు చేయాలని కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీ మహిళలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా సమాన వాటా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మొగుడంపల్లి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మారుని బాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చున్ను బీ, పద్మమ్మ, తుల్జమ్మ, నర్సమ్మ, మంజుల, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి