Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెజిలో ఫార్మాలో విషాదం.. రియాక్టర్‌లో పడి షిఫ్ట్ ఇంచార్జ్ మృతి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 16, 2026 11:24 PM

మహిళలకు న్యాయం చేయండి.. రిజర్వేషన్ బిల్లును అమలు చేయండి: మహిళా కాంగ్రెస్

మహిళలకు న్యాయం చేయండి.. రిజర్వేషన్ బిల్లును అమలు చేయండి: మహిళా కాంగ్రెస్

మహిళలకు న్యాయం చేయండి.. రిజర్వేషన్ బిల్లును అమలు చేయండి: మహిళా కాంగ్రెస్
July 16, 2026 05:42 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం మన్నపూర్ గ్రామంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి పేరుతో పోస్ట్‌కార్డుల ఉద్యమం నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ, 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని, మహిళలకు రాజకీయాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును అమలు చేయాలని కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీ మహిళలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా సమాన వాటా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మొగుడంపల్లి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మారుని బాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చున్ను బీ, పద్మమ్మ, తుల్జమ్మ, నర్సమ్మ, మంజుల, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News