PRINT TIME: July 16, 2026 11:22 PM
ప్రతి ఇంటికి చేరి ఓటరు నమోదు పూర్తి చేయాలి: జహీరాబాద్ SIR సమావేశంలో పిలుపు
ప్రతి ఇంటికి చేరి ఓటరు నమోదు పూర్తి చేయాలి: జహీరాబాద్ SIR సమావేశంలో పిలుపు
July 16, 2026 08:43 PM
6 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
జహీరాబాద్ పట్టణంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో అన్ని మండలాల బీఎల్ఏలతో నిర్వహించిన SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి, జహీరాబాద్ ఇంచార్జ్ డా. ఏ. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి అర్హుడైన ఓటరు తప్పనిసరిగా నమోదు కావాలని, ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్ల భర్తీ పూర్తి చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నమోదు ప్రక్రియను వేగవంతం చేసి జహీరాబాద్ నియోజకవర్గంలో SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు నిర్మల–జగ్గారెడ్డి, రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి