Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెజిలో ఫార్మాలో విషాదం.. రియాక్టర్‌లో పడి షిఫ్ట్ ఇంచార్జ్ మృతి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 16, 2026 11:24 PM

విద్యార్థినిలు ఉన్నత ఆశయాలతో ముందుకు సాగాలి: చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి

విద్యార్థినిలు ఉన్నత ఆశయాలతో ముందుకు సాగాలి: చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి

విద్యార్థినిలు ఉన్నత ఆశయాలతో ముందుకు సాగాలి: చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి
July 16, 2026 07:52 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కేజీబీవీ పాఠశాలలో ఘనంగా అవగాహన సదస్సు

విద్యార్థినిలు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి, ఉన్నత ఆశయాలతో సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలని చౌటుప్పల్ డీఎస్పీ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో స్థానిక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను మంచి కోసం వాడుకోవాలని, సోషల్ మీడియా వినియోగంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఆన్‌లైన్ మోసాలు,ఓటీపీ (OTP) స్కామ్‌లు, నకిలీ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.తెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దని,ఎలాంటి అనుమానాస్పద ఆన్‌లైన్ లింకులను క్లిక్ చేయవద్దని విద్యార్థినిలకు వివరించారు.

రోడ్డు భద్రత–జీవితానికి రక్ష

ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడం, కార్లలో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి అని తెలిపారు.​పాదచారుల భద్రతా నియమాలను పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.

​బాల్య వివాహాలు,బాలలపై జరిగే వేధింపుల పట్ల విద్యార్థినిలు అవగాహన కలిగి ఉండాలని,ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని భరోసా ఇచ్చారు.తల్లిదండ్రులు,గురువులను గౌరవిస్తూ..ఆత్మవిశ్వాసంతో చదువుకుని దేశ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని విద్యార్థినిలను మోటివేట్ చేశారు.​ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎస్.హెచ్.ఓ జి. మన్మథ కుమార్, పోలీస్ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినిలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News