వెలిమినేడు శివారులో గోవధ కలకలం.. సిమెంట్ రింగుల్లో కళేబాలు వెలుగులోకి
వెలిమినేడు శివారులో గోవధ కలకలం.. సిమెంట్ రింగుల్లో కళేబాలు వెలుగులోకి
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో గోవధకు సంబంధించిన ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. జాతీయ రహదారి-65పై ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ వెనుక నార్లగుట్ట సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గోవులను వధ చేసి, వాటి కళేబాలను ఎవరికి అనుమానం రాకుండా సిమెంట్ రింగుల్లో భద్రపరిచినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
స్థానిక యువకులకు అనుమానం రావడంతో అక్కడ ఉన్న సిమెంట్ రింగులను పగులగొట్టి పరిశీలించగా కళేబాలు బయటపడినట్లు సమాచారం. దీంతో విషయం గ్రామంలో వేగంగా వ్యాపించి ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఈ ఘటన వెనుక ఉన్న నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసు అధికారులను కోరుతున్నారు. అలాగే కళేబాలను రహస్యంగా దాచిపెట్టడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే దానిపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి