Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:11 AM

వెలిమినేడు శివారులో గోవధ కలకలం.. సిమెంట్ రింగుల్లో కళేబాలు వెలుగులోకి

వెలిమినేడు శివారులో గోవధ కలకలం.. సిమెంట్ రింగుల్లో కళేబాలు వెలుగులోకి

వెలిమినేడు శివారులో గోవధ కలకలం.. సిమెంట్ రింగుల్లో కళేబాలు వెలుగులోకి
09-07-2026 443 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో గోవధకు సంబంధించిన ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. జాతీయ రహదారి-65పై ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంక్ వెనుక నార్లగుట్ట సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గోవులను వధ చేసి, వాటి కళేబాలను ఎవరికి అనుమానం రాకుండా సిమెంట్ రింగుల్లో భద్రపరిచినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

స్థానిక యువకులకు అనుమానం రావడంతో అక్కడ ఉన్న సిమెంట్ రింగులను పగులగొట్టి పరిశీలించగా కళేబాలు బయటపడినట్లు సమాచారం. దీంతో విషయం గ్రామంలో వేగంగా వ్యాపించి ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఈ ఘటన వెనుక ఉన్న నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసు అధికారులను కోరుతున్నారు. అలాగే కళేబాలను రహస్యంగా దాచిపెట్టడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే దానిపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

వెలిమినేడు శివారులో గోవధ కలకలం.. సిమెంట్ రింగుల్లో కళేబాలు వెలుగులోకి

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో గోవధకు సంబంధించిన ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. జాతీయ రహదారి-65పై ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంక్ వెనుక నార్లగుట్ట సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గోవులను వధ చేసి, వాటి కళేబాలను ఎవరికి అనుమానం రాకుండా సిమెంట్ రింగుల్లో భద్రపరిచినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

స్థానిక యువకులకు అనుమానం రావడంతో అక్కడ ఉన్న సిమెంట్ రింగులను పగులగొట్టి పరిశీలించగా కళేబాలు బయటపడినట్లు సమాచారం. దీంతో విషయం గ్రామంలో వేగంగా వ్యాపించి ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఈ ఘటన వెనుక ఉన్న నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసు అధికారులను కోరుతున్నారు. అలాగే కళేబాలను రహస్యంగా దాచిపెట్టడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే దానిపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News