Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:01 AM

చోరీ తర్వాతా చీకట్లోనే బాల నరసింహస్వామి ఆలయం..!

చోరీ తర్వాతా చీకట్లోనే బాల నరసింహస్వామి ఆలయం..!

చోరీ తర్వాతా చీకట్లోనే బాల నరసింహస్వామి ఆలయం..!
08-07-2026 207 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


భద్రతా లోపాలపై భక్తుల ఆందోళన – లైటింగ్ లేక అంధకారంలో దేవస్థాన ప్రాంగణం.


నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బాల నరసింహస్వామి దేవస్థానంలో జరిగిన చోరీ ఘటన భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆలయంలోకి నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి హుండీని ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది.

చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చినప్పటికీ ఆలయ ప్రాంగణంలో భద్రతా చర్యలు చేపట్టకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో సరైన లైటింగ్ సౌకర్యం లేకపోవడంతో రాత్రివేళ మొత్తం ప్రాంగణం అంధకారంలో మునిగిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే చోరీ ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో ఆలయ చైర్మన్, నిర్వాహకులు వెంటనే స్పందించి ప్రాంగణంలో హైమాస్ట్ లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ఈ దేవస్థానంలో కనీస భద్రతా ప్రమాణాలు కూడా లేకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఆలయ ప్రాంగణంలో భద్రతా లోపాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇకనైనా అధికారులు, ఆలయ పాలకవర్గం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

చోరీ తర్వాతా చీకట్లోనే బాల నరసింహస్వామి ఆలయం..!

Article Image


భద్రతా లోపాలపై భక్తుల ఆందోళన – లైటింగ్ లేక అంధకారంలో దేవస్థాన ప్రాంగణం.


నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బాల నరసింహస్వామి దేవస్థానంలో జరిగిన చోరీ ఘటన భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆలయంలోకి నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి హుండీని ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది.

చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చినప్పటికీ ఆలయ ప్రాంగణంలో భద్రతా చర్యలు చేపట్టకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో సరైన లైటింగ్ సౌకర్యం లేకపోవడంతో రాత్రివేళ మొత్తం ప్రాంగణం అంధకారంలో మునిగిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే చోరీ ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో ఆలయ చైర్మన్, నిర్వాహకులు వెంటనే స్పందించి ప్రాంగణంలో హైమాస్ట్ లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ఈ దేవస్థానంలో కనీస భద్రతా ప్రమాణాలు కూడా లేకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఆలయ ప్రాంగణంలో భద్రతా లోపాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇకనైనా అధికారులు, ఆలయ పాలకవర్గం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News