చోరీ తర్వాతా చీకట్లోనే బాల నరసింహస్వామి ఆలయం..!
చోరీ తర్వాతా చీకట్లోనే బాల నరసింహస్వామి ఆలయం..!
Komidala Mahender reddy
భద్రతా లోపాలపై భక్తుల ఆందోళన – లైటింగ్ లేక అంధకారంలో దేవస్థాన ప్రాంగణం.
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బాల నరసింహస్వామి దేవస్థానంలో జరిగిన చోరీ ఘటన భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆలయంలోకి నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి హుండీని ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది.
చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చినప్పటికీ ఆలయ ప్రాంగణంలో భద్రతా చర్యలు చేపట్టకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో సరైన లైటింగ్ సౌకర్యం లేకపోవడంతో రాత్రివేళ మొత్తం ప్రాంగణం అంధకారంలో మునిగిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే చోరీ ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో ఆలయ చైర్మన్, నిర్వాహకులు వెంటనే స్పందించి ప్రాంగణంలో హైమాస్ట్ లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ఈ దేవస్థానంలో కనీస భద్రతా ప్రమాణాలు కూడా లేకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఆలయ ప్రాంగణంలో భద్రతా లోపాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇకనైనా అధికారులు, ఆలయ పాలకవర్గం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి