Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గొట్టిపర్తి లో రికార్డు స్థాయిలో 103 అడ్మిషన్లు ప్రజా ప్రతినిధుల సహకారంతో ఈ అద్భుత విజయం...పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీహరి నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 08, 2026 06:40 PM

ఆదోని టీడీపీ కార్యకర్తల సమస్యలు రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి పల్లా శ్రీనివాసరావును

ఆదోని టీడీపీ కార్యకర్తల సమస్యలు రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి పల్లా శ్రీనివాసరావును

ఆదోని టీడీపీ కార్యకర్తల సమస్యలు రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి పల్లా శ్రీనివాసరావును
July 08, 2026 04:33 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విజయవాడ, : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదోని నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు మారుతి నాయుడు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మాజీ ఎమ్మెల్యే, ఆదోని నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కొంకా మీనాక్షి నాయుడు నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, కార్యకర్తల సమన్వయం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని, నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని మారుతి నాయుడికి సూచించారు.

ఆదోని యువ నాయకుల అభిప్రాయాలను సానుకూలంగా స్వీకరించిన రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మారుతి నాయుడు తెలిపారు.

ఈ సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, వినయ్ తిరుమలేష్ రెడ్డి పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News