ఆదోని టీడీపీ కార్యకర్తల సమస్యలు రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి పల్లా శ్రీనివాసరావును
ఆదోని టీడీపీ కార్యకర్తల సమస్యలు రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి పల్లా శ్రీనివాసరావును
Editor Desk
విజయవాడ, : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదోని నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు మారుతి నాయుడు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మాజీ ఎమ్మెల్యే, ఆదోని నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి కొంకా మీనాక్షి నాయుడు నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, కార్యకర్తల సమన్వయం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని, నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని మారుతి నాయుడికి సూచించారు.
ఆదోని యువ నాయకుల అభిప్రాయాలను సానుకూలంగా స్వీకరించిన రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మారుతి నాయుడు తెలిపారు.
ఈ సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, వినయ్ తిరుమలేష్ రెడ్డి పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి