మాదిగ జాతి వేగుచుక్క ఎమ్మార్పీఎస్– జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి
మాదిగ జాతి వేగుచుక్క ఎమ్మార్పీఎస్– జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి
K.RAVI
సామాజిక ఉద్యమాలకు, పేదల హక్కుల పోరాటాలకు ఎమ్మార్పీఎస్ ఉద్యమమే దిక్సూచి అని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలను మంగళవారం స్థానిక బస్టాండ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బొడ్డు శ్రవణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ.. 32 ఏళ్ల క్రితం మారుమూల గుడిసెలో పుట్టిన ఎమ్మార్పీఎస్, నేడు మాదిగ జాతి జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో హక్కుల వాటాను సాధించుకున్నామని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణతో పాటు ఆరోగ్యశ్రీ సాధన, వికలాంగుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేసిన ఘనత ఎమ్మార్పీఎస్ దేనని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బోయ రామచందర్, మాజీ సర్పంచ్ ఉదరి నరసింహ, మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర నాయకులు ఉదరి వెంకటేష్ మహాజన్, మాజీ మండల అధ్యక్షులు సుక్క అర్జున్, అడ్వకేట్ కట్టెల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ మున్సిపల్ అధ్యక్షులు ఎర్ర శంకర్, ఉదరి శ్యాం, ఆరుట్ల లింగస్వామి, దొనకొండ కృష్ణ, ఉదరి నరసింహా, చీమకండ్ల శ్రీనివాస్, ఎర్ర గౌతం, దొనకొండ కిరణ్, బద్రి బాలరాజ్, బోయ జోసెఫ్, బోయ అరవింద్, బోయ సృజన్ భరద్వాజ్, సుక్క ప్రవీణ్, ఎర్ర చింటూ, కడుపు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి